ముస్లిం ఆడబిడ్డ వివాహానికి ఆర్థికంగా చేయూతనిచ్చిన బొర్రా వెంకట అప్పారావు

సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లు మండలం చాగల్లు గ్రామానికి చెందిన షేక్ బాషా షేక్ బేగం దంపతులు గ్రామంలో కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండగా వారి కుమార్తె షేక్ హసీనాకి వివాహం నిశ్చయం కాగా, వారు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసిన మండల అధ్యక్షులు శ్రీమతి తాడువాయి లక్ష్మీ నియోజకవర్గ నాయకురాలు బొర్రా వెంకట అప్పారావు కి తెలియజేయగా ఆయన ఆర్థికంగా సహాయం చేసి వారికి అండగా నిలబడ్డారు. ఈ కార్యక్రమంలో నకరికల్లు మండలం వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నాగుర్ వలి, వైస్ ప్రెసిడెంట్ షేక్ రఫీ, దూళిపాల దళిత నాయకుడు చిలకా సత్యం, రూరల్ మండల అధ్యక్షుడు నాదెండ్ల నాగేశ్వర, షేక్ జానీ పీర్, నకరికల్లు మండలం జాయింట్ సెక్రెటరీ సతకల ఏడుకొండలు పాల్గొన్నారు.