కాకినాడ సిటి జనసేనలో చేరికలు

కాకినాడ సిటి, ఆదివారం సాయంకాలం నాలుగు గంటలకు కాకినాడ సిటిలోని 43వ డివిజన్ లో శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో 100 మంది పార్టీలో చేరి సభ్యత్వం తీసుకున్నారు. వారిని జనసేన పార్టీ పిఎసి సభ్యులు మరియు కాకినాడ సిటీ ఇంచార్జీ ముత్తా శశిధర్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించి జనసేన పార్టీ కండువాలు వేసి అభినందనలు తెలిపారు. జనసేనలో చేరిన కళ్యానమ్మ, పూర్ణాదేవి, ఉమ, వతి, నానిబాబు, రాజేష్, శివశంకర్, కొండ బాబు, సురేష్, లోనకుమార్, శ్రీనివాస్, సూర్య, సాయి, రమేష్, శ్రీహరినాయుడు, దుర్గాప్రసాద్, సాయిశ్రానికీ, జాగఛాస్కర్, శేవషజిర్, అకుల వాసు, ప్లానిడి, కింష్, రాజు, యోగి, రాజు, అవినాష్, శ్రీను, బాలకృష్ణ, మహేష్ తదితరులు ఆనందాన్ని వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా ముత్తా శశిధర్ మాట్లాడుతూ… దేశ, రాష్ట్ర భవిష్యత్తు నేటి భవితమీద ఉందని సమాజ సంక్షేమం కోసం యువత పాలుపంచుకోవడం హర్షనీయనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలపై ఆకర్షితులై నడుంకట్టి ముందుకు వచ్చినందుకు అభినందిస్తూ, మనమందరం పవన్ కళ్యాణ్ సారధ్యంలో పోరాటాలు చేస్తూ ఒక కొత్త ప్రజాసంక్షేమ ప్రభుత్వానికి నాంది పలుకుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాకినాడ వీటి అధ్యక్షులు సంగిశెట్టి అశోక్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, జిల్లా కార్యదర్శి అట్ల సత్యనారాయణ, జిల్లా సంయుక్త కార్యదర్పి బడే కృష్ణ, వీరమహిళలు, జనసైనికులు చిట్టూరి మౌనిక్, వీరు, సాయి, మణికంట, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.