జనసేనలో చేరిన జె వి అగ్రహరం యువత

విశాఖపట్నం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీ ఆశయ సాధనకై మేము సైతం అంటూ బుధవారం జనసేన పార్టీ ఆఫీస్ లో భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్ డా. సందీప్ పంచకర్ల సమక్షంలో జనసేన పార్టీ భీమిలి మహిళ నాయకులు ఒమ్మి దేవి యాదవ్ ఆధ్వర్యంలో జె వి అగ్రహరం నుంచి యువత జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా డా. సందీప్ పంచకర్ల మాట్లాడుతూ.. జనసేన పార్టీ ని ప్రజల్లోకీ తీసుకొని వెళ్తూ, రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపు కీ కృషి చెయ్యాలని తెలియజేసారు.