పలు కుటుంబాలను పరామర్శించిన జ్యోతుల శ్రీనివాసు

కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామానికి చెందిన పేరూరు రాజు గత రెండుసంవత్సరాల నుంచి కాలు గాయం కావడం వల్ల ఇంటి వద్దనే ఉండి వైద్య సహాయం పొందుతూ ఎటువంటి ఉపాధి లేని సమయంలో పేరూరి రాజు భార్య అయిన పేరూరి గోవిందమ్మ ఒక ప్రైవేట్ స్కూల్లో వంటమనిషిగా చేరి వంట చేస్తున్న సమయంలో అగ్నిప్రమాదం జరగడం వల్ల రెండు కాళ్లు కాలిన కారణంగా ప్రస్తుతం స్వగృహం నందు వైద్యం చేయించుకుంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. పేరూరి రాజు గోవిందమ్మ దంపతులను సోమవారం ఉదయం దుర్గాడ గ్రామంలో వారి స్వగృహం నాకు వెళ్లి పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు ప్రమాదం జరిగిన తీరుని అడిగి తెలుసుకుని భార్యాభర్తలు ఇరువురికి మనోధైర్యం కల్పించి మీకు ఎల్లప్పుడు సాయిప్రియ సేవాసమితి,జనసేన పార్టీ తరఫున నేను అండగా ఉంటానని వారికి 25 కేజీల బియ్యం, కిరాణా సామాన్లు, నగదును సహాయంగా అందించారు. ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ మీకు ఏ కష్టం వచ్చినా నేనెప్పుడూ అందుబాటులో ఉంటానని ఒక్క ఫోన్ చేస్తే మీకు తగిన సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా పేరూరు రాజు దంపతులకు భరోసాని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల సీతారాంబాబు, రావుల తాతారావు, సాధనాల చంటిరాము, జ్యోతుల గోపి, కీర్తి చిన్నా, అయినవిల్లి రాంబాబు, జ్యోతుల సాంబ, మంతెన గణేష్, చేసెట్టి భద్రం, ఒట్టూరి నాగేశ్వరరావు, కోలా సూరిబాబు, నీలం నాగేశ్వరరావు, తీడా లొవరాజు, దోనిపూడి శివాజీ, అయినవిల్లి రాజు, కోసూరి ప్రసన్న, కటారి కృష్ణ, కాకినాడ రాము, ఆయనవిల్లి అప్పారావు, శాఖ సురేష్, మేడిబోయిన హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.