కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉండే ఏకైక పార్టీ జనసేన

మైలవరం: ఇటీవల రోడ్డు ప్రమాదాలకు గురైన క్షతగాత్రులు జనసేన కార్యకర్తలు జనసేన క్రియాశీలక సభ్యత్వం కలిగి ఉన్నందున పలువురు జనసేన కార్యకర్తలకు ప్రమాద బీమాను అందించారు. కార్యక్రమంలో భాగంగా ఇబ్రహీంపట్నం మండలం, గుంటుపల్లి గ్రామానికి చెందిన జనసేన కార్యకర్తలు కంచి అరుణ, వేగి సందీప్ కుటుంబాలకి జనసేన పార్టీ తరఫున లక్ష రూపాయల బీమా చెక్కుని మరియు కేతనకొండ గ్రామానికి చెందిన కొల్ల దుర్గారావు కుటుంబానికి యాభై వేల రూపాయల బీమా చెక్కుని అందించడం జరిగింది. ఈ చెక్కుల పంపిణీ ముఖ్య అతిథులుగా విచ్చేసిన కృష్ణాజిల్లా జనసేన పార్టీ బండ్రెడ్డి రామకృష్ణ మరియు మైలవరం నియోజవర్గ ఇంచార్జ్ అక్కల రామ్మోహన్ రావు లకు ఇబ్రహీంపట్నం మండల జనసైనికులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అక్కల గాంధీ మాట్లాడుతూ.. భవిష్యత్తులో మైలవరం నియోజవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని జనసేన కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకురాలు రావి సౌజన్య, జనసేన మండల అధ్యక్షుడు పోలిశెట్టి తేజ, ఉపాధ్యక్షుడు కొమ్మూరు హనుమంతరావు, కేతనకొండ గ్రామ అధ్యక్షుడు కొమ్మూరు వెంకటస్వామి, బ్రహ్మయ్య, నాని, నాగబాబు, ధర్మారావు, అశోక్, బాల మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.