వరుపుల సత్యప్రభ రాజాకు శుభాకాంక్షలు తెలిపిన జ్యోతుల శ్రీనివాసు

ప్రత్తిపాడు నియోజకవర్గం: మంగళవారం సాయంత్రం పత్తిపాడునియోజవర్గం ఎన్.డి.ఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న వరుపుల సత్యప్రభ రాజాను పిఠాపురం నియోజవర్గ జనసేన నాయకులు, జిల్లాకార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు మర్యాదపూర్వకంగా కలిసి ఆమెకు శుభాకాంక్షలు అందజేశారు. పత్తిపాడు నియోజవర్గం ఎన్.డి.ఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న వరుపుల సత్యప్రభ రాజా 23వ తేదీ మంగళవారం మధ్యాహ్నం నామినేషన్ వేసిన సందర్భంగా పిఠాపురం జనసేన నాయకులు, జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు ఆమె స్వగృహం నందు కలిసి ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ పత్తిపాడు నియోజకవర్గంలో నుంచి ఎన్.డి.ఏ కూటమి తెలుగుదేశంపార్టీ అభ్యర్థి సోదరి వరుపుల సత్యప్రభ రాజా ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మేకల కృష్ణ, దుర్గాడ గ్రామ జిల్లా పరిషత్ హై స్కూల్ చైర్మన్ కందా శ్రీనివాస్, జ్యోతుల వీరబాబు, నేమాల కన్నయ్య, జీలకర్ర భాను, కోలా నాని తదితరులు ఉన్నారు.