కిరాణాషాపును ప్రారంభించిన జ్యోతుల శ్రీనివాసు

పిఠాపురంనియోజవర్గం: గొల్లప్రోలుమండలం, దుర్గాడ గ్రామంలో గల హరిజనపేట కాలనీ నందు పెదపాటి అప్పలస్వామి గనికమ్మ దంపతులచే ఏర్పాటు చేసుకొన్న నూతనకిరాణాషాపును సోమవారం జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముందుగా జ్యోతుల శ్రీనివాసు పెదపాటి అప్పలస్వామి గనికమ్మ ఏర్పాటు చేసుకున్న కిరణా షాపును రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ చిన్న చిన్న కిరాణావర్తకులు బాగా వ్యాపారం చేయుటకు తాను ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తాని, ఈ చిరువ్యాపారం ఇంకా ఎక్కువ అభివృద్ధి చెంది పెదపాటి అప్పలస్వామి గనికమ్మ ఆర్థికంగా అభివృద్దిని సాదించాని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రావుల తాతారావు, మేడిపోయిన సత్యనారాయణ, జ్యోతుల సీతారాంబాబు,పోన్నాగంటి శివ, జ్యోతుల గోపి, కోలా నాని, మేడిబోయిన హరికృష్ణ, సాయిప్రియసేవాసమితి కార్యదర్శి మేకల కృష్ణ, సంఘ కాపరి విప్పర్తి సమర్పణరావు దంపతులు, విప్పర్తి మరియమ్మ, విప్పర్తి కృపారావు, పెదపాటి కామరాజు, విప్పర్తి దొంగయ్య, మసరపు దొంగయ్య, విప్పర్తిసహాయం, విప్పర్తి కృష్ణమ్మ తదితరలు పాల్గొన్నారు.