జనసైనికుడి నూతన గృహాన్ని, కిరాణా షాపును ప్రారంభించిన జ్యోతుల శ్రీనివాసు

పిఠాపురం, గొల్లప్రోలు మండలం, దుర్గాడ గ్రామం జగనన్న కాలనీలో నివాసం ఉంటున్న జనసైనికుడు, భవననిర్మాణ కార్మికుడు అయిన విప్పర్తిలోవరాజు నూతనగృహాన్ని ప్రారంభించిన అనంతరం నూతనగృహం నందు ఏర్పాటు చేసిన నూతన కిరాణాషాపును జ్యోతుల శ్రీనివాసు ప్రారంభించారు‌. ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ దళితకులానికి చెందిన నిరుపేద, భవననిర్మాణ కార్మికుడైన విప్పర్తి లోవరాజు మంచివ్యక్తి తను రోజువారీ భవన నిర్మాణ పనులు చేసుకుంటూ ఇంటి వద్ద కిరాణా షాపును నిర్వహించుకుంటూ నీతినిజాయితీ మార్గంలో తన కుటుంబాభివృద్ధిని సాధించుకోవాలని రేపు రాబోయే రోజులలో ఇప్పర్తి లోవరాజు ఆర్థికంగా స్దిరపడి తన తోటివారికి కూడా సహాయ సహకారాలు అందించాలని జ్యోతుల శ్రీనివాసు ఆకాంక్షించారు‌. ఈ కార్యక్రమలో జ్యోతుల సీతరాంబాబు, కీర్తి చిన్న, సంఘకాపరైన(పాస్టర్) విప్పర్తి సమర్పణారావు దంపతులు, మారంపూడి నాని, విప్పర్తి కృపానందం, మందపల్లి యేసు, విప్పర్తి పేరయ్య, మారంపూడి మరియమ్మ, విప్పర్తి మరియమ్మ, పెదపాటి లోవమ్మ, పెదపాటి లోవమ్మ, గోరింటా సింహాచలం, ఇప్పర్తి అప్పలరాజు, పెదపాటి మరియమ్మ, విప్పర్తి శ్రీను తదితరులు పాల్గొన్నారు.