విలేకరి కరిముల్లాకు అండగా నిలచిన కదిరి శ్రీకాంత్ రెడ్డి

తాడిపత్రి నియోజకవర్గం: అనంతపురం జిల్లా, తాడిపత్రి లోని స్పాట్ న్యూస్ విలేకరి కరిముల్లా తల్లి అనారోగ్యం కారణంగా మంగళవారం అర్ధరాత్రి మృతి చెందారు. స్థానిక జనసైనికుల ద్వారా విషయం తెలుసుకున్న జనసేన తాడిపత్రి నియోజక వర్గ ఇంఛార్జి కదిరి శ్రీకాంత్ రెడ్డి కరిముల్లా ను పరామర్శించి, మనోదైర్యం చెప్పి 20,000 ఆర్థిక సాయం అందించారు.