ఇందిరమ్మ కాలనీలో పర్యటించిన కదిరి శ్రీకాంత్ రెడ్డి

  • కార్యకర్త ఆహ్వానం మేరకు ఇంటికి వెళ్ళిన జనసేన పార్టీ నియోజవర్గ ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం బుగ్గ గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త రాజేష్ ఆహ్వానం మేరకు తాడిపత్రి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి కార్యకర్తలతో కలిసి బుగ్గ గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలోని వారి ఇంటికి వెళ్ళి.. వారి కుటుంబంతో మాట్లాడి, అదేవిధంగా ఇందిరమ్మ కాలనీలో పర్యటించి.. అక్కడ నివాసం వుంటున్న వారితో మాట్లాడి సమస్యలను తెలుకోవడం జరిగింది. ఇక్కడి ఇందిరమ్మ కాలనీలో ముఖ్యంగా రోడ్డు సమస్య, వీధి లైట్ల సమస్య ఉందని కాలనీ వాసులు శ్రీకాంత్ రెడ్డి కి తెలపడం జరిగింది. ఈ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి గ్రామస్తులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.