కాకినాడ సిటీ జనసేన ఆధ్వర్యంలో అంబేడ్కర్ కు ఘన నివాళులు

కాకినాడ సిటీ: జనసేన పార్టీ కాకినాడ సిటీ ఇన్చార్జ్ & పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్ నాయకత్వంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య ఆధ్వర్యంలో రేచర్ల పేటలోని డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి విగ్రహానికి ఆయన వర్ధంతిని పురస్కరించుకుని పూలదండలు వేసి నివాళులు అర్పించడం జరిగినది. ఈ సందర్భంగా జనసేన పార్టీ శ్రేణులు మాట్లాడుతూ పేదరికంలో పుట్టడం శాపం కాలేదని తన తెలివితేటలతో భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించడం ద్వారా నిరూపించిన అపర మేధావి అని కొనియాడారు. దేశాన్ని నడపడంలోను, ప్రజలకు సుపరిపాలన చేయడంలోను అనుసరించవలసిన విధానాలను దశాబ్దాల క్రితమే ఊహించి జాగ్రత్తలు తీసుకున్నారనీ ఇంకో శతాబ్దం అయినా చెక్కుచెదరని పునాదిని అందించిన డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి సేవలని భావితరాలవారికి అందచేయడం మన కర్తవ్యమని అన్నారు. అదేవిధంగా బుధవారం కాకినాడ సిటి ఉపాధ్యక్షులు అడబాల సత్యన్నారాయణ ఆధ్వర్యంలో టీం సభ్యుల బృందం ముంబైలోని చైత్య భూమి వద్ద తాము కాకినాడ సిటిలో గత నలబై రోజులు భీం యాత్రని జరిపి వివిధ ప్రాంతాలలోని అంబేడ్కర్ విగ్రహాల వద్దనుండీ కలశాలలో సేకరించిన మట్టిని అక్కడ కలిపి బాబా సాహెబ్ అంబేడ్కర్ గారికి అంజలిఘటించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కాంటా రవిశంకర్, మనోహర్ లాల్ గుప్తా, పచ్చిపాల మధు, ముత్యాల దుర్గాప్రసాద్, కోడి శ్రీను, కంచుమర్తి రాము, పైడిపాల బుజ్జి, కొండ్రు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.