కళ్యాణదుర్గం ఐదు మండలాలు జనసేన పార్టీ మండల కమిటీలు ఏర్పాటు

కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ఐదు మండలాలు జనసేన పార్టీ మండల కమిటీలు ఏర్పాటు చేసి లెటర్ ప్యాడ్ నోట్ ను అనంతపురం జిల్లా అధ్యక్షులు టిసి.వరుణ్ కి ఇవ్వడం జరిగింది. ఈ కమిటీలలో నిస్వార్థంగా పని చేసిన జనసైనికులకు మండల కమిటీలు తీసుకోవడం జరిగింది అని కళ్యాణదుర్గం నియోజకవర్గం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లక్ష్మీ నరసయ్య, సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్, కళ్యాణదుర్గం మండల కన్వీనర్ షేక్ మొహిద్దీన్, కుందుర్తి మండల కన్వీనర్ జయ కృష్ణ, బ్రహ్మసముద్రం మండల కన్వీనర్ ఆంజనేయులు, సెట్టూరు జనసేన నాయకులు రామలింగ, బ్రహ్మసముద్రం నాయకులు అనిల్ మొదలైన జనసైనికులు పాల్గొనడం జరిగింది.