గొర్రిపూడిలో ఎటుచూసినా పాడైపోయిన రోడ్లు, పాడైపోయిన లైట్లు: జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి పోలసపల్లి సరోజ

కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని కరప మండలం గొర్రిపాడు గ్రామంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు కాకినాడ ప్రధమ మేయర్ శ్రీమతి పోలసపల్లి సరోజ, తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు శ్రీమతి మరియు శ్రీ పిల్లి అనంతలక్ష్మిసత్యనారాయణ మూర్తి ఐదవ రోజు ఇంటింటికి పర్యటన చేశారు. ఈ సందర్బంగా గ్రామస్తులు అక్కడి ఇబ్బందులను వివరించారు. విచ్చిన్నమైన రోడ్లు , గ్రామంలో కనీసం లైట్లు కూడా పనిచేయని వైనం, కనీసం త్రాగడానికి మంచినీటి సరఫరా కూడా చేయని ప్రభుత్వం దాని పనితీరుకు నిదర్శనం అని ఈ కలుషితం అయిన మంచినీరు వల్ల ఆరోగ్య సమస్యలతో సతమతమవున్నామని మొరపెట్టుకున్నారు.అవినీతి,అక్రమాల కొలువైన ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే దిశగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. రాబోయే జనసేన-తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందనీ,ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలు సత్వరమే అందుతాయని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.