అంగన్వాడీల నిరవధిక సమ్మెకు కళ్యాణదుర్గం జనసేన మద్దతు

కళ్యాణదుర్గం నియోజకవర్గం: కళ్యాణదుర్గంలో తహశీల్దార్ కార్యాలయం ముందు అంగన్వాడీల నిరవధిక సమ్మెకు మద్దతుగా కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన పార్టీ తరపున జిల్లా జాయింట్ సెక్రెటరీ మరియు కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన సమన్వయకర్త బాల్యం రాజేష్ ఆధ్వర్యంలో సంఘీభావం తెలపడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాడ్యుటి ఇవ్వాలని, గత ఆరు నెలల నుండి పెండింగ్లో పెట్టిన సెంటర్ అద్దెలు, టిఏ బిల్లులు తక్షణం చెల్లించాలని, ఆయాల ప్రమోషన్లకు వయోపరిమితి 50 సంవత్సరాలకు పెంచి, రాజకీయ జోక్యాన్ని నివారించాలని, మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా గుర్తించి వేతనాలు, ప్రమోషన్లు కల్పించాలని అంగన్వాడీల డిమాండ్లు అన్ని నెరవేర్చాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్రహ్మసముద్రం మండల అధ్యక్షులు ఆంజనేయులు, పట్టణ నాయకులు సయ్యద్, వంశీ, ముక్కన్న, జాకీర్, అనిల్, వీరమహిళ షేక్ తార, బ్రహ్మసముద్రం మండల జనసేన నాయకులు తిప్పేరుద్ర, గోవిందు, కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన పార్టీ మీడియా ఇంచార్జ్ బ్రహ్మసముద్రం రాయుడు తదితరులు పాల్గొన్నారు.