క్రియాశీలక కార్యకర్తకు ఏక్సిడెంటల్ పాలసి ద్వారా చెక్కును అందజేసిన కందుల దుర్గేష్

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ క్రియాశీలక కార్యకర్తలకు ఏక్సిడెంటల్ పాలసి ద్వారా తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్, రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ ఆద్వర్యంలో రామచంద్రపురం పట్టణము 18 వ వార్డు కవలవారి సావరం గ్రామంలో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న జనసైనికుడు పోలిశెట్టి మల్లిఖార్జునరావుకి ఇటీవల బైక్ యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. జనసేన పార్టీ తరఫున 32,194 రూపాయల చెక్ ను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ PAC సభ్యులు శ్రీ పితాని బాలకృష్ణ, అమలాపురం నియొజకవర్గ ఇంచార్జ్ శ్రీ శెట్టిబత్తుల రాజబాబు, తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి సుంకర కృష్ణవేణి, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.