భీముని పాలెం ఉపాధి కూలీలతో కరిమజ్జి మల్లీశ్వారావు భేటి..!

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలం, భీముని పాలెం గ్రామం చెరువులలో సోసైటి బ్యాంకు మాజీ చైర్మన్ మరియు జనసేన పార్టీ నాయకులు కరిమజ్జి మల్లీశ్వారావు, కృష్ణాపురం పంచాయతీ యంపీటిసి అభ్యర్థి పోట్నూరు లక్ష్మునాయుడు మరియు పతివాడిపాలేం జనసేన పార్టీ నాయకులు రెడ్డి వెంకటరమణ కలిసి ఉపాధి కూలీలతో మాట్లాడుతూ.. వారిని నేరుగా పలకరిస్తూ.. ఘనంగా పవనన్న ప్రజాబాట చేపట్టారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడమే లక్ష్యం అంటూ.. ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఆ పార్టీ నాయకులు చేపట్టిన పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా.. సోమవారం నియోజకవర్గంలో ప్రతి చెరువులో ఉన్న ప్రజలను కలవడం జరిగింది. ఇంటింటికి తిరిగే పవనన్న ప్రజాబాట ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించి 48 రోజులు పాటు సుదీర్ఘంగా ప్రజలు దగ్గరకు వెళ్లి పలు కుటుంబాలను పలుకరిస్తూ.. ముందుకు సాగడం జరిగింది.

ఈ సందర్భంగా కరిమజ్జి.మల్లీశ్వారావు, పోట్నూరు లక్ష్మునాయుడు, రెడ్డి వెంకటరమణ, మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే లక్ష్యంతో తాము ప్రారంభించిన పవనన్న ప్రజాబాటకు ప్రజలనుండి అపూర్వ స్పందన లభిస్తోందన్నారు. గత ఎన్నికల సందర్భంగా ఒక్క ఛాన్స్ జగన్ కి ఇద్దాం అని ఓటేసిన వారెవరూ ఈసారి వైసిపి కి ఓటు వేసేందుకు సిద్ధంగా లేరన్నారు. ఈ కార్యక్రమంలో భీముని పాలెం గ్రామ పెద్దలు, మహిళలు, మెహన్ రావు, మేఖేల్, కూర్మారావు, శ్రీరాములు, మహేష్, సీతయ్య, కనకారావు తదితరులు పాల్గొన్నారు.