శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో కర్రి కళ్యాణి ప్రత్యేక పూజలు
పాలకొండ: సోమవారం, మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం కేంద్రానికి చెందిన శ్రీమతి కర్రి. కళ్యాణి గతంలో ప్రజారాజ్యం పార్టీలో శ్రీకాకుళం జిల్లా తరుపున మహిళా కో కన్వీనర్ గా పనిచేసినటువంటి శ్రీమతి కర్రి కళ్యాణి విజయనగరం జిల్లా తాడిపూడి రిసార్ట్ లో పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మరియు ఫాఛ్ మెంబర్ శ్రీమతి. పాలవలస యసస్వి పాలకొండ నియోజకవర్గం నాయుకులు జనసేన జానీ, పోరిడి ప్రశాంత్, పొట్నూరు రమేష్, సమక్షంలో జనసేన పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. ఈ సందర్బంగా తన సొంత ఊరు వీరఘట్టం తెలగవీధిలో ఉన్నటువంటి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో కర్రి కళ్యాణి, జనసేన జానీ, మత్స పుండరీకం, వావిలపల్లి భూషణ్, కర్నెన సాయిపవన్, బొమ్మాళి వినోద్ పాల్గొని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు మీద ప్రత్యేక పూజ చెయ్యడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రజలు కోసం నిజాయితీగా పోరాటం చేస్తూ సరికొత్త నాయకత్వం వహిస్తున్న పవన్ కళ్యాణ్ 2024 లో సీఎం అవ్వాలి. అని ప్రత్యేక పూజలు చెయ్యడం జరిగింది.