ఏపీలో ఆలయ నిర్మాణం కోసం కేసిఆర్ విరాళం

ఏపీలో ఆలయ నిర్మాణం కోసం కేసిఆర్ విరాళం అందజేసారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం స్వర్ణముఖి దివ్యక్షేత్రంలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో సాయం కోసం నిర్వాహకులు కేసీఆర్‌ను సంప్రదించగా.. ఆయన చేయూతనిచ్చారు. ఆలయానికి సంబంధించిన మహారాజ గోపురం, తూర్పు మాడవీధి నిర్మాణానికి కేసీఆర్ దంపతులు విరాళమిచ్చారు. ఈ మేరకు ఆలయ నిర్వాహకులు ఆయన పేరిట శిలాఫలకం ఆవిష్కరించారు.

ఆలయ నిర్మాణం పూర్తి కావడంతో నిన్న శ్రీవారి విగ్రహ ప్రతిష్ఠ వైభవంగా జరిగింది. వాస్తవానికి ఈ వేడుకల్లో కేసీఆర్ దంపతులు కూడా పాల్గొనాల్సి ఉంది. కానీ కరోనా వ్యాప్తి దృష్ట్యా వారు హాజరుకాలేదు.