అంతిమ యాత్రలో పాల్గొన్న కిల్లో రాజన్

పాడేరు: గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం రాత్రి స్వగ్రామమైన మద్దిగరువులో జి మాడుగుల మండలం బొయితెలి గ్రామ పంచాయితీ, విఆర్ఏ బుక్క కాంతమ్మ స్వర్గస్తులయ్యారని రూరల్ జిల్లా జనసేన పార్టీ జాయింట్ సెక్రెటరీ కిల్లో రాజన్ తెలుసుకొని, హుటాహుటిన వారి ఇంటికి చేరుకుని అంతిమ యాత్రలో పాల్గొని కాంతమ్మకి కన్నీటి వీడ్కోలు పలికారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.