టెక్కలి జనసేన కార్యాలయంలో ఛలో అమరావతి పోస్టర్ రిలీజ్ చేసిన కణితి కిరణ్

మార్చి 14న జరగబోయే జనసేన 9వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం టెక్కలి నియజకవర్గం, జనసేన కార్యాలయంలో చలో అమరావతి పోస్టర్ ను టెక్కలి ఇన్ ఛార్జ్ కణితి కిరణ్ విడుదల చేసారు. ఈ సందర్భంగా కణితి కిరణ్ మాట్లాడుతూ.. జనసేన ఆవిర్భావ దినోత్సవ సభా వేదిక కు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దళిత నేత, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ దామోదర సంజీవయ్య పేరుతో నామకరణం చేశారని తెలిపారు. ఈ సభ ద్వారా పార్టీ అధ్యక్షులు రాబోయే 2024 ఎన్నికలలో జనసేన పార్టీ వైఖరిని తెలియ జేస్తారని.. పార్టీ నాయకులకు.. కార్యకర్తలకు దిశా నిర్దేశిస్తారని తెలిపారు. టెక్కలి నాలుగు మండలాలనుండి ఈ సభను జయప్రదం చేయడానికి జనశ్రేణులు భారీ ఎత్తున తరలి రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టెక్కలి నియజకవర్గం నాలుగు మండలాల నాయకులు, వార్డు నెంబర్లు, ఎంపీటీసీ అభ్యర్థులు, రాం ప్రసాద్, కోటి, హరి రమేష్, చందు, గవరయ్య, విశ్వనాధం, జనార్దన్, వెంకటేష్ తదితరులు పాల్గున్నారు.