ముద్రగడపై ధ్వజమెత్తిన కిరణ్ రాయల్

తిరుపతి, కేవలం తాయిలాలకు ఆశపడి ఏపీలో కాపునేత తానేనని ప్రగల్బాలు పలికే ముద్రగడ పద్మనాభం వైకాపా పార్టీకి కాపు కాసేందుకు కాపలాగా మారాడని, వైసీపీ వేసే బిస్కెట్లకు ఆశపడి నిజమైన కాపులకు వెన్నుపోటు పొడిచి ఘనకీర్తి గడించిన ముద్రగడ మరోసారి తమ జనసేనానిపై విమర్శలు చేస్తే, తమ జనసైనికులు పిచ్చికుక్కను కొట్టినట్టు కొడతారని, జనసేన పార్టీ తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆదివారం మీడియా ముందు జనసేన పార్టీ నేతలు నగర అధ్యక్షుడు రాజారెడ్డి, బాబ్జి, హరి ప్రసాద్, రమేష్ నాయుడు, ఆది, వంశీ, రాజు, లోహిత్ లతో కలిసి కిరణ్ మాట్లాడుతూ.. కాపు రిజర్వేషన్ కోసం పోరాడే దమ్ము ముద్రగడకు లేదన్నారు. వైకాపా ఏ హామీ ఇస్తే ఆ పార్టీలో చేరారో బహిరంగంగా నిజాన్ని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. కాపు నిధులు ఏమయ్యాయని సీఎం జగన్ ను ముద్రగడ ప్రశ్నించగలడా అని డిమాండ్ చేశారు. మా పవన్ వెంట ఏపీ జనం ఉన్నారని కొనియాడారు. ముద్రగడకు సొంత పార్టీ పెట్టే ధైర్యం ఉందా అని సవాల్ విసిరారు. ముద్రగడ వెనక కాపులు లేరని, కేవలం నెల జీతం కోసం ముద్రగడ ఫ్యాన్ పార్టీకి పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. మరోసారి తమ జనసేనానిని దూషిస్తే జనసైనికులు ఊరుకోరని హెచ్చరించారు.