జనసేన డిజిటల్ క్యాంపెయిన్ లో కోడుమూరు జనసేన

కర్నూలు జిల్లా, కోడుమూరు నియోజకవర్గం కోడుమూరు మండల కేంద్రంలో (కోడుమూరు-ముడుమలగుర్తి రోడ్) గోరంట్ల మెయిన్ రోడ్ దుస్థితిని వివరిస్తూ కోడుమూరు నియోజకవర్గం జనసేన పార్టీ తరపున నిద్రపోతున్న ముఖ్యమంత్రి జగన్ ని మేలుకొల్పడం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు #GoodMoringCMsir డిజిటల్ క్యాంపెయినింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఆకెపోగు రాంబాబు, ఎల్లప్ప, శాలుబాషా, రాజు, గిరీష్, కమల్ రాజు, సుంకన్న, మురళి, రవి, మధు జనసైనికులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.