జనసేన ప్రచారరధాన్ని ప్రారంభించిన కోన తాతారావు

గాజువాక నియోజకవర్గం: పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకై జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆదివారం గాజువాక నియోజకవర్గం 73వ వార్డు, వార్డు అధ్యక్షులు రౌతు గోవిందరావు ప్రచారరథం ఏర్పాటు చేయడం జరిగింది. 73 వార్డు పెద్ద నడుపూరు గాంధీ పార్క్ వద్ద ప్రచారరధాన్ని పిఎసి సభ్యులు, విశాఖ అర్బన్ సమన్వయకర్త, గాజువాక ఇన్చార్జ్ కోన తాతారావు చేతుల మీదుగా జెండా ఊపి ప్రారంభోత్సవం జరిగింది. అనంతరం పెద నడుపూరు గ్రామం నుండి పాతగా జోక జంక్షన్ వరకు భారీ ఎత్తున ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఘడసాల అప్పారావు, ఫైనాన్స్ కమిటీ సభ్యులు తిప్పల రమణారెడ్డి, 64 వార్డు కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి, గవర సోమశేఖర్, కాదా శ్రీను, గంధం వెంకట్రావు, లంకల మురళి దేవి, జనసేన నాయకులు వీరమహిళలు, జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.