బత్తుల దంపతులను అభినందించిన కొణిదెల నాగబాబు

రాజానగరం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీకి 12 లక్షల 50 వేలు యు.పి.ఐ ద్వారా, 3.12 లక్షల రూపాయలు చెక్కుల రూపంలో భారీ విరాళాలను సేకరించి మొత్తం 15 లక్షల 62 వేల విరాళాన్ని సేకరించిన రాజానగరం నియోజకవర్గం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, నా సేన కోసం నా వంతు కమిటీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి సేకరించిన విరాళం మొత్తం 15 లక్షల 62 వేల రూపాయలను చెక్కు రూపంలో మంగళవారం హైదరాబాద్ ప్రశాశన్ నగర్ లో గల జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కొణిదెల నాగబాబుకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా నాగబాబు రాజానగరం నియోజకవర్గం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, నా సేన కోసం నా వంతు కమిటీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి లను ప్రత్యేకంగా అభినందించారు. నా సేన కోసం నా వంతు కార్యక్రమం కోసం నియమించిన కమిటీ సభ్యులు క్షేత్ర స్థాయిలో పనిచేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుతున్నానని, జనసేన పార్టీ పటిష్టత కోసం ప్రజలు స్వచ్ఛదంగా భాగస్వామ్యం అవుతూ, పార్టీ చేపడుతున్న ప్రతీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న విధానం పార్టీకి కొండంత బలంగా రూపుదిద్దుకుంటోందని ఈ సందర్భంగా నాగబాబు తెలియజేశారు. విరాళాలు అందించిన రాజానగరం నియోజకవర్గం జనసేన శ్రేణులకు నాగబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బత్తుల బలరామకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గ పరిధిలో గల గ్రామాలలో నా సేన కోసం నా వంతు కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను ఉత్తేజితం చేసి అధిక సంఖ్యలో భాగస్వామ్యం చేయడం జరిగిందని తెలిపారు. పార్టీకి అండగా నిలబడే జనసైనికులతో పనిచెయ్యడం చాలా ఆనందంగా, సంతృప్తిగా ఉందని అన్నారు.