బీజేపీ నేతల అరెస్టు అప్రజాస్వామికం

నిరసన కార్యక్రమాలు చేపట్టడం.. వాస్తవాలు తెలుసుకొనేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించడం ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల బాధ్యత. ఆ బాధ్యతతోనే బీజేపీ రాష్ట్ర నాయకులు గుడివాడ వెళ్తుంటే అడ్డుకొని అరెస్టు చేయడం అప్రజాస్వామికమని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, ఎంపీ సి.ఎం.రమేశ్, ఎమ్మెల్సీలు పి.వి.ఎన్.మాధవ్, వాకాటి నారాయణరెడ్డి, ఇతర నాయకులను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నాం. గుడివాడలో జరిగిన పరిణామాలపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపైనే ఉందని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.