కూకట్ పల్లి జనసేనలో భారీ చేరికలు

తెలంగాణ, కూకట్పల్లి బీజేపీ మరియు జనసేన ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ సమక్షంలో మూసాపేటకి చెందిన వ్యాపారవేత్త నక్కా ప్రసాద్ అధ్వర్యంలో కూకట్పల్లి 115 డివిజన్ జనసేన నాయకులు తోట సంతోష్ కుమార్ మరియు సోము వేణుగోపాల్ స్వామి ప్రోత్సాహంతో వందమంది యువత ఆదివారం జనసేనలో చేరడం జరిగింది. కొత్తగా చేరిన వారికి బీజేపీ మరియు జనసేన ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ జనసేన పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.