వైసీపి ఎమ్మెల్యే దర్శనము పి.వెంకటాపురం ప్రజలకు కరువైంది: పోలసపల్లి సరోజ

కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని పి.వెంకటాపురం గ్రామంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కాకినాడ ప్రధమ మేయర్ మరియు పోలసపల్లి సరోజ, తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి పదకొండవ రోజు ఇంటింటికి పర్యటించి జనసేన పార్టీ సిద్ధాంతాలతో కూడిన కరపత్రాలను పంచుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను మరియు జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించడం జరిగింది. చేశారు. ఈ సందర్బంగా నియోజకవర్గ ప్రజలు అక్కడి ఇబ్బందులను వివరించారు. స్థానిక వైసీపి ఎమ్మెల్యే దర్శనము పి.వెంకటాపురం ప్రజలకు కరువైంది. డ్రైనేజీలు లేకపోవడం వల్ల మురుగు రోడ్డెక్కుతోంది. అర్హులైన వారికి అందించే పదకాలు ఇవ్వకుండా మొండి చెయ్యి చూపిస్తుంది. అవినీతి, అక్రమాల కొలువైన ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే దిశగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. రాబోయే జనసేన తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందనీ, ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలు సత్వరమే అందుతాయని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, వీరమహిళలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.