చంద్రశేఖర్ ఆజాద్ కు నివాళులర్పించిన కూకట్పల్లి జనసేన

కూకట్ పల్లి, చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతి పురస్కరించుకుని కేపిహెచ్బి 5వ ఫేజ్ జనసేన పార్టీ ఆఫీసులో జరిగిన చంద్ర శేఖర్ ఆజాద్ వర్ధంతి కార్యక్రమంలో కూకట్ పల్లి నియోజక వర్గ జనసేన ఎమ్మెల్యే కంటెస్టెడ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ చంద్ర శేఖర్ ఆజాద్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ భారతదేశ యువతకు ఆదర్శం, మహానీయుడు, విప్లవవీరుడు ఉద్యమకారుల్లో గొప్పవాడు. నా చావు నా చేతుల్లో ఉంది. శత్రువుల చేతుల్లో లేదని తనకు తాను దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భరతమాత వీరపుత్రుడు చంద్రశేఖర ఆజాద్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి జనసేన పార్టీ కో-ఆర్డినేటర్లు కొల్లా శంకర్, వేముల మహేష్, డివిజన్ ప్రెసిడెంట్లు కలిగినీడి ప్రసాద్, సలాది శంకర్, జెమిని సునీల్, వెంకటేశ్వరరావు, మారుతి, శేఖర్, మధుసూదన్ రెడ్డి, సుబ్బు, నామన బుల్లి రాజు, శ్రీనివాసరావు, పసుపులేటి ప్రసాద్, బండారు వెంకటేష్ మరియు వీర మహిళలు, లక్ష్మీ, శ్యామలాదేవి తదితరులు పాల్గొన్నారు.