నూతన సంవత్సర క్యాలెండరును ఆవిష్కరించిన కర్నూలు జనసేన

కర్నూలు, జనసేన పార్టీ నూతన సంవత్సర క్యాలెండరును జనసేన నాయకులు పవన్ కుమార్ కర్నూలు నగరం నందు ఆధ్వర్యంలో కాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకుడు పవన్ కుమార్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుంచి కరోనాతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని కొత్త సంవత్సరం నుండి అంతా మంచే జరగాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బెస్త సత్యనారాయణ, శ్రీనివాసలు, మౌలాలి, సతీష్, శివ, సాయి అబ్దుల్లా, దినేష్, అనిల్, తదితరులు పాల్గొన్నారు.