చంద్రగిరి నియోజకవర్గంలో జనసేనలో చేరిన పాకాల మండలం కీలక నాయకులు

జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ అశయాలకు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై చంద్రగిరి నియోజకవర్గం వైఎస్సార్సీపీ, టీడీపీ పార్టీల నుంచి పాకాల మండలం కీలక నాయకులు రాశిక్, అమితాజ్ లు జనసేన పార్టీ PAC సభ్యులు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు శ్రీ డా.పసుపులేటి హరిప్రసాద్ సమక్షంలో, రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి సుభాషిణి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ చిన్నా రాయల్, జిల్లా కమిటీ కార్యదర్శి శ్రీ నాసీర్ ఆధ్వర్యంలో సోమవారం జనసేన పార్టీలో చేరడం జరిగింది.