ముఖ్యమంత్రిపై మండిపడ్డ కుంటిమద్ది జయరామిరెడ్డి

అనతపురం, జగన్మోహన్ రెడ్డి మీరు ఒక మానసిక రోగి అని గురువారం సామర్లకోట సభ ద్వారా తేటతెల్లమైపోయింది. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీతం గురించి కించపరిచే విధంగా తప్పుడు మాటలు మాట్లాడితే రాష్ట్ర మహిళలు నిన్ను క్షమించరు అని తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి హోదాలో ఇతరుల భార్యల గురించి తప్పుడు మాటలు మాట్లాడటం ద్వారా నీవు ముఖ్యమంత్రిగా పరిపాలన చేయడానికి అర్హత కోల్పోయావు? గత నాలుగున్నర సంవత్సరాలుగా “నీ రూపాయి పావలా ప్రభుత్వం” ప్రతి సంక్షేమ పథకం విషయంలో రాష్ట్ర ప్రజలని మోసగిస్తూనే పాలిస్తున్నావు. 30 లక్షల గృహాలు అంటివి? కనీసం మూడు లక్షల గృహాలు కూడా లబ్ధిదారులకు నిర్మించి అందించిన పాపాన పోలేదు? నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ ఏ జిల్లాలో? ఏ మండలంలో? ఏ ఏ లబ్ధిదారులకు ఎన్ని గృహాలు నిర్మించి అందజేసారు? స్పష్టంగా పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేసి రాష్ట్ర ప్రజలకు తెలపాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. దాదాపు రెండున్నర లక్షల కోట్లు సక్కగా బటన్ నొక్కి సంక్షేమ పథకాల రూపంలో లబ్ధిదారుల అకౌంట్ కు అందజేస్తున్నాను అంటున్నావ్? ఇదంతా నువ్వు అప్పు చేస్తూ ఇస్తున్న డబ్బులే కదా? ఈ అప్పు అంతా ఎలా తీర్చాలి? ఎవరు తీర్చాలి? రాష్ట్ర భావితరాల భవిష్యత్తుని ఏం చేద్దాం అనుకున్నావ్? ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్ర అభివృద్ధి శూన్యం. నీకు చేతనైతే దమ్ము ధైర్యం ఉంటే రాష్ట్ర అభివృద్ధి గురించి ఎంత పురోగతి సాధించావో? రాష్ట్ర ప్రజలకు వివరించు. నీ చేతకాని అసమర్థత పాలని కప్పిపుచ్చుకునే కోసం ప్రతిపక్ష నాయకుల్ని, వారి భార్యలను, వారి కుటుంబ సభ్యులు ని కించపరుస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నావు. గురిగింజ తను నలుపు ఎరగదు అన్నట్టు నీ కుటుంబ సభ్యుల వ్యక్తిగత జీవితాలు గురించి మాట్లాడితే? నీ తల ఎక్కడ పెట్టుకుని తిరుగుతావు సైకో జగన్ రెడ్డి. నీవు అక్రమ సంపద అవినీతి కేసుల్లో కోర్టు చుట్టూ తిరుగుతున్న కాబట్టి మిగతా వారందరూ కూడా అవినీతిపరులే అని నిందలు వేసినంత మాత్రాన రాష్ట్ర ప్రజలు నీ మాయమాటలు నమ్మే పరిస్థితుల్లో లేరని తెలుసుకో? నీ వంకర టింకర మాటలు మానుకో లేకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలు నీకు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరిస్తున్నామని అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి అన్నారు.