ప్రజల ఆస్తులు కొట్టేయడానికే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌!

తాడేపల్లిగూడెం: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల ఆస్తులకు భద్రత లేదని తాడేపల్లిగూడెం కోటమ్మ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం పుల్లయ్య గూడెం ఎల్ అగ్రహారం కొండ్రుపోలులో జరిగిన ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మేనిఫెస్టోలో సైతం పల్లెల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టితో తెలుగుదేశం జనసేన సమిష్టిగా ఒక ప్రణాళిక రూపొందించామని చెప్పారు. నన్ను ఎదుర్కొనే దమ్ము లేక డమ్మీ అభ్యర్థులను, డమ్మీ గుర్తులను బ్యాలెట్ పేపర్ పై ఉంచేందుకు ప్రయత్నాలు చేసిన కొట్టు సత్యనారాయణ ఓటమి ఖాయమన్నారు. మీకంటే బోకులు రాష్ట్రంలో లేరని ఒకటి మమ్మల్ని అంటే 100 మేము అనడానికి నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పల్లెటూర్లను పంచాయితీ నిధులు దారి మళ్లించడం ద్వారా నాశనం చేసిన ఘనత వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి దక్కుతుందని కూటమి ప్రభుత్వం రాగానే గ్రామ స్వరాజ్యం అంటే ఏంటో నిరూపిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వలవల బాబ్జి, ఈతకోట తాతాజీ, అడప ప్రసాద్, పరిమి రవికుమార్, వాడపల్లి సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.