జనసేనలోకి భారీగా నాయి బ్రాహ్మణుల చేరిక

తిరుపతి, జనసేన అభ్యర్థి ఆరని శ్రీనివాసులు విజయం సాధించడంలో.. తాము ప్రధాన భూమిక పోషిస్తామని నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శి బుచ్చిబాబు ఆరణి శ్రీనివాసులకు హామీ ఇచ్చారు. మంగళవారం స్థానిక హొటల్ లో జరిగిన జనసేనలోకి నాయి బ్రాహ్మణుల జన సంద్రం సభకు పెద్ద ఎత్తున నాయి బ్రాహ్మణులు హాజరయ్యారు. తమ న్యాయమైన డిమాండ్లు తీర్చాలంటూ అభ్యర్థి ఆరనిని బుజ్జి బాబు అర్థించారు. తాను జనసేన ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే మీ న్యాయమైన కోరికలను తీరుస్తానని బుజ్జిబాబు కు ఆరని హామీ ఇచ్చారు. అనంత రఒ చిత్తూరు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ ఉమ్మడి టిడిపి , బిజెపి , జనసేన ల కూటమిలో భాగంగా ప్రతి ఒక్క ఓటరు గాజు గ్లాసుకు ఓటు వేసి జనసేన ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా పసుపులేటి పిలుపునిచ్చారు.