జనసేన ఆధ్వర్యంలో నందలూరులో భారీ ఎత్తున అన్నదానం

రాజంపేట, నందలూరు పేటగడ్డలో వెలసిన శ్రీశ్రీశ్రీ చెన్నకేశవస్వామి ఆలయం దగ్గర జనసేన పార్టీ యువ నాయకుడు అతికారి దినేష్ ఆధ్వర్యంలో దాదాపు 1000 మందికి పైగా అన్నదానం చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతికారి దినేష్ ని నందలూరు జనసేన నాయకులు మస్తాన్ రాయల్ స్థానిక జనసేన నాయకులు, జనసైనికులు స్థానిక ప్రజలు బాణసంచా పేల్చి ఘనంగా స్వాగతం పలకడం‌ జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక జనసేన సానుభూతి పరులు అయిన సొమిశెట్టి బ్రదర్స్ అతికారి దినేష్ ను వాళ్ళ ఇంటికి అహ్వనించి సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు పోలిశెట్టి శ్రీనివాసులు, ప్రశాంత్ భరతాల, గురివిగారి వాసు, అద్దంకి జానకినాథ్, ఆకుల రాము, మంకు వెంకటేశ్, కోనేటి శివ, కస్తూరి సురేష్, తిప్పాయపల్లె ప్రశాంత్, ఎల్లిశెట్టి వినోద్, అనమల హరి, వెలగచెర్ల హరిబాబు, లంకయ్యగారి సాయి, సుబ్బరాయుడు, పసుపులేటి మల్లి, రాజేష్, బద్రీనాథ్ జనసైనికులు భారీగా పాల్గొనడం జరిగింది.