అనంతపూర్ లో క్రియాశీల సభ్యత్వం ప్రారంభం

అనంతపూర్ జిల్లా అధ్యక్షులు టీసీ వరుణ్ సూచన మేరకు సోమవారం గుంతకల్లు నియోజకవర్గ జనసేన పార్టీ అనంతపూర్ జిల్లా సంయుక్త కార్యదర్శి అరికేరి జీవన్ కుమార్ ఆధ్వర్యంలో క్రియాశీల సభ్యత్వం ప్రారంభం. జనసేన పార్టీ అధినేత జనసేనని పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు అండగా నిలవాలి అన్న ఉద్దేశంతో… ఒక్క మహోనతమైన ఆలోచనతో పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వీరమహిళలు మరియు అభిమానులకు ఉపయోగపడే విధంగా “క్రియాశీల సభ్యత్వం” ని ప్రవేశపెట్టారు. జనసేన పార్టీ పేద, బడుగు బహీనవర్గాల పార్టీగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా పార్టీలో రోజువారీ కూలీలే ఎక్కవగా ఉన్నారు. అది పెయింటర్స్ గానీ , బెలదర్స్ గానీ, పంట కూలీ పనులకు, డ్రైవర్స్, ఎలెజ్ట్రీషియన్ ఇలా వివిధ రకాలుగా రోజువారీ కూలీలే ఎక్కవగా ఉన్నారు. ఎపుడైనా అనుకోకుండ ప్రమాదానికి గురైన్పుడు చికిత్స కోసం హాస్పిటల్ చేరిన వారికి ఆర్థికంగా అండగా నిలవాలి అన్ని వారికి చికిత్స కోసం 50వేల వరకు ప్రమాదానికి గురైన వ్యక్తికి మన జనసేన పార్టీ సహాయ పడుతుంది మరియు ప్రమదవశాత్తు ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోతే ఆ యెక్క వ్యక్తి కుటుంబం రోడ్డున పడకూడదు అని జనసేన పార్టీ ప్రమాద భీమా ద్వార ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి కుటుంబానికి 5 లక్షలు వరకు జనసేన పార్టీ అండగా నిలుస్తోంది. నియోజకవర్గ ప్రజలకు ఈ విషయాన్ని గమనించాలి జనసేన పార్టీకి అధికారం లేదు, అలాగని ప్రతిపక్షంలో కూడా లేదు. అయినా కూడా పార్టీ కోసం కష్ట పడే వాళ్లకు కష్టం వస్తే వాళ్లకు అండగా నిలవాలని “క్రియాశీల సభ్యత్వం” ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మొదలు పెట్టారు. అందులోని గుంతకల్లు నియోజకవర్గం వైసీపీ అరాచక పాలన కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది… ఓటర్లు గ్రహించండి. పార్టీ కార్యకర్తల కోసమే ఇంతలా ఆలోచించే జనసేన పార్టీ అధికారంలోకి వస్తే, జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక , ప్రజల కొసం మరియు రాష్ట్ర అభివృధి కోసం జనసేన పార్టీ ఇంకా ఎంతలా ఆలోచిస్తుందో అర్థం చేసుకోండి. వైసీపీ చేతకాని పాలనకు నాంది పలకండి 2024 లో వైసీపీని గద్దె దించి జనసేన పార్టీకి అవకాశం ఇవ్వండి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు రవితేజ, విజయ్ కుమార్, నవీన్, అలెక్స్, సాయి, ప్రశాంత్, రాము, రాజు, విజయ్, వీరేష్, చిన్న, గణేష్, స్మైలి రాజ్, జీలాన్, రాంబాబు, మణికంఠ, గౌతమ్, ప్రవీణ్, మహేష్, రవి తేజ, సోహైల్, హెన్రీపాల్, ఆర్ సి సురేష్ కుమార్, సాయి, గణేష్ పి.ఎస్.పి.కె, ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు.