ఏడు గంగమ్మలకు సారే సమర్పించిన వినుత కోటా

శ్రీకాళహస్తి నియోజకవర్గం: శ్రీకాళహస్తి పట్టణంలో ప్రతి ఏటా ఎంతో ప్రతిష్టగా నిర్వహించే ఏడు గంగమ్మల జాతర సంద్భంగా బుధవారం పట్టణంలో నెలకోల్పిన 7 గంగమ్మలకు సారే సమర్పించి నాయకులు, వీరమహిళలతో వెళ్లి దర్శించుకొన్న జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా. నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేలా ఆశీర్వదించాలని అమ్మ వారిని వేడుకోవడం జరిగింది. నాయకులు తోట గణేష్, పేట చంద్ర శేఖర్, పేట చిరంజీవి, గురవయ్య, రాజేష్, సురేష్ , దినేష్, ఉదయ్ , జ్యోతి రామ్, వీరమహిళలు లక్ష్మి, రాజ్య లక్ష్మి, బత్తెమ్మ, శారద, గాయత్రి, నిర్మల, జయలలిత జనసైనికులు గోపి, బబ్లూ, వంశీ తదితరులు పాల్గొన్నారు.