హోరు వానలో రెండు టన్నుల కాయగూరల పంపిణీ

  • సొంత నిధులతో వరద ప్రభావిత ప్రాంతాలకు అండగా లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి

అనంతపురం, గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు అనంతపురం నియోజకవర్గంలో యువజన కాలనీ మరియు తదితర కాలనీలు నీట మునిగినాయి. లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి ఆధ్వర్యంలో ముంపు ప్రాంతమైన యువజన కాలనీలో వర్షం, వరద నీటిలోనే ప్రజల కష్ట సుఖాలను తెలుసుకొని ప్రతి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి మీకు జనసేన పార్టీ అండగా ఉంటుంది భయపడాల్సిన అవసరం లేదని భరోసాను కల్పించి జనసేన పార్టీ ఆవశ్యకతను తెలియజేయడం జరిగింది. లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి సొంత నిధులతో రెండు టన్నుల కాయగూరలను వర్షం వరద నీటిలోనే ప్రతి ఇంటికి వెళ్లి వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి, అనంతపురం జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు మురళీకృష్ణ, జనసేన నాయకులు పాలగిరి చరణ్, మెరుగు శ్రీనివాసులు, ఊటుకూరి జయకృష్ణ భవాని నగర్ మంజునాథ్, బండి ప్రవీణ్ కుమార్ మరియు జనసేన నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.