జనసైనికునికి అండగా నిలిచిన జనసేన నాయకులు

సత్యసాయి జిల్లా, కదిరి నియోజకవర్గం, ఎన్.పి కుంట మండలంలోని మేకల చెరువు గ్రామానికి చెందిన 28ఏళ్ల వినోద్ కి రెండు కిడ్నీలు చెడిపోయి కిడ్నీ దాతల కోసం సంవత్సర కాలం ఎదురు చూసి ఫలితం లేక చివరికి తన భార్య కిడ్నీ ఇవ్వడానికి ముందుకు రావడంతో ఆపరేషన్ ఖర్చుకి 4లక్షలు అవసరమని డాక్టర్లు చెప్పడం జరిగింది. ఈ విషయం జనసేన నాయకులు కొట్టి కుమార్ దృష్టికి తీసుకురావడంతో తక్షణమే స్పందించి జనసేన నాయకులతో కలిసి 21,116/- రూపాయల ఆర్ధిక సహాయం చెయ్యటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తనకల్లు మండల అధ్యక్షులు కేవీ రమణ, జనసేన పార్టీ జిల్లా కార్యనిర్వాహకాల కమిటీ సభ్యులు షేక్ ఫయాజ్, చౌదరి, శ్రీనివాస్, షేక్ కలేశా, కిరణ్, శ్రవణ్, లక్ష్మణ, మస్తాన్, శ్రీనాథ్, రమేష్, చౌదరి, అనిల్ కుమార్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.