తల్లిలా సేవ చేసే వారిరిపై ప్రభుత్వం వివక్ష చూపకూడదు: అచ్చనాల కేశవ్‌

అనంతపురం జిల్లా, ఉరవకొండ, వజ్రకరూరు మండల కేంద్రం మండల అధ్యక్షులు అచ్చనాల కేశవ్‌ అద్వర్యంలో అంగన్వాడీలు వారి న్యాయపరమైన డిమాండ్ల సాధనకై చేపట్టిన సామూహిక ధర్నా కార్యక్రమంలో జనసేన పార్టీ తరఫున సంఘీభావం తెలిపి వారికి మద్దతుగా సభను ఉద్దేశించి కేశవ్ మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు ఒక తల్లిలా సేవ చేసే వీరిపై ప్రభుత్వం వివక్షత ఉండకూడదని తెలియజేసారు. ఇలా అవనీతి, అక్రమాలకు పాల్పడితే మీరు తగిన మూల్యం చెల్లించవల్సి వస్తుందని, ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమములో మండల నాయకులు రాము, నరేంద్ర, రమేష్ తదితరులు పాల్గొన్నారు.