ప్రతి పల్లెలో జనసేన జెండా ఎగరవేద్దాం: పెండ్యాల హరి

*నియోజకవర్గంలో పార్టీ సంస్థాగతంపై సమీక్ష
*నియోజకవర్గ ముఖ్యనాయకులతో భేటీ

శింగనమల, పల్లె పల్లెనా జనసేనపార్టీ జెండా ఎగరవేద్దామని జనసేనపార్టీ జిల్లా నాయకులు పెండ్యాల హరి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం శింగనమల నియోజకవర్గంలోని పలు మండలాల అధ్యక్షులు, ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా పెండ్యాల హరి మాట్లాడుతూ పార్టీ బలోపేతం కావాలంటే పల్లెలే పట్టుకొమ్మాలని కావున ప్రతి గ్రామంలో పర్యటించి పార్టీలో మరింత మందిని చేర్చుకునే విధంగా ప్రణాళిక రచించాలని అన్నారు. మండల కమీటీ నిర్మాణం చేపట్టేటప్పుడు ప్రతి పల్లె నుండి క్రియాశీలక జనసైనికులను గుర్తించి వారికి కూడా సమూచిత స్థానం కల్పించాలని పార్టీ నేతలకు ఆయన దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు చొప్ప చంద్ర, కాసెట్టి సంజీవరాయుడు, మండలాల అధ్యక్షులు గంజికుంట రామకృష్ణ, ఏర్రిస్వామి, శ్రీరాములు, నియోజకవర్గ నాయకులు కొండిశెట్టి ప్రవీణ్ కుమార్, తోట ప్రకాష్, విశ్వనాథ్ రెడ్డి, జిల్లా నాయకులు టిఎన్ అంజి, జనసైనికులు రామయ్య, దండు హరీష్, సుమన్, సాయి తదితరులు పాల్గొన్నారు.