పవన్ కళ్యాణ్ ని సీఎం చేయడానికి సమష్టి కృషి చేద్దాం

  • జనసేన క్రియాశీల సభ్యత్వ కిట్ల పంపిణీ
  • ముఖ్య అథితులుగా జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నయాబ్ కమల్, ప్రచార నిర్వహణ కమిటీ రాష్ట్ర కార్యదర్శి విశ్వనాధ్
  • పెద్ద సంఖ్యలో పాల్గొన్న జనసైనికులు

కొవెలకుంట్ల, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేసుకోవాలంటే జనసేన పార్టీ నాయకులు జనసైనికులు సమిష్టిగా పోరాడాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నయాబ్ కమల్, ప్రచార నిర్వహణ కమిటీ రాష్ట్ర కార్యదర్శి విశ్వనాధ్ అన్నారు. శనివారం బనగానపల్లె నియోజకవర్గం కోవెలకుంట్లలో నియోజకవర్గ స్థాయి జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కిట్ల పంపిణీ కార్యక్రమం స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి ఫంక్షన్ హాల్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమాల్ ప్రచార నిర్వహణ కమిటీ రాష్ట్ర కార్యదర్శి విశ్వనాధ్ పాల్గొన్నారు. క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమంలో కీలకంగా వ్యవహరించిన జనసేన క్రియాశీలక వాలంటీర్లను శాలువాతో ఘనంగా సత్కరించారు.అనంతరం సభను ఉద్దేశించి వారు మాట్లాడుతూ జనసైనికులు పవన్ కళ్యాణ్ కి జనసేన పార్టీకి కార్యకర్తలు కాదని కుటుంబ సభ్యులని వారి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ ఐదు లక్షల ప్రమాద భీమా ఏర్పాటు చేశారని అన్నారు. భారత దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ, ఏ నాయకుడు కార్యకర్తలకు ఇలాంటి అరుదైన గౌరవాన్ని ఇవ్వలేదని, అది దూరదృష్టి ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ తోనే సాధ్యమని అన్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి అలాగే జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మనందరం పార్టీ ఆదేశించినట్టు జనసేన ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బనగానపల్లె నియోజకవర్గ నాయకులు, నియోజకవర్గంలోని ఐదు మండలాల జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.