పొడగట్లపల్లిలో జనసేనకు అవకాశం ఇద్దాం – ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిద్దాం కార్యక్రమం

కొత్తపేట: రావులపాలెం మండలం, పొడగట్లపల్లి గ్రామంలో కొత్తపేట నియోజకవర్గ ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్ జనసేనకు అవకాశం ఇద్దాం ప్రజాప్రభుత్వాన్ని స్థాపిద్దాం ప్రచార కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ప్రతి గడపకు వెళ్ళి ప్రస్తుతం ప్రభుత్వం వలన ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జనసేనకు అవకాశం ఇస్తే కచ్చితంగా సమస్యలు పరిష్కారానికి కృషిచేస్తాం అని హమి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దొంగా సుబ్బారావు, మండల అధ్యక్షులు తోట స్వామి, గ్రామ అధ్యక్షులు భూపతిరాజు రామరాజు, జనిపిరెడ్డి తాతారావు, వీటి రాజు, పులగం ప్రసన్న కుమార్, కొండేపర్తి శ్రీను, గండి శ్రీను, చిక్కం సుబ్రహ్మణ్యం, జిల్లా కార్యదర్శులు, మండల అధ్యక్షులు, గ్రామ‌ ప్రెసిడెంట్లు, ప్రోగ్రామ్ కమిటీ మెంబర్లు, వీరమహిళలు, నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.