రేచర్ల పేట ప్రాంతంలో జనసేన ముస్లిమ్ సచార్ యాత్ర

కాకినాడ సిటీ: జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు కాకినాడ సిటీ ఇన్ ఛార్జ్ ముత్తా శశిధర్ ఆలోచనలతో సోమవారం 6వ డివిజన్ రేచర్ల పేట ప్రాంతంలో జనసేన ముస్లిమ్ సచార్ యాత్ర డాక్టర్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఈ పాంతంలోని ముస్లిం ప్రజలతో డాక్టర్ బాబు కలిసి సంభాషించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వై.సి.పి ప్రభుత్వం చెపుతున్న అభివృద్ధి, సంక్ష్యేమం అన్నవి కేవలం వార్తాపత్రికల్లో అడ్వర్టైజ్మెంట్లలో తప్ప బయట కనపడటం లేదని ప్రజలు అనుకుంటున్నారన్నారు. ముస్లింలు, పేద బలహీన బడుగు వర్గాల ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, టీచర్లు, పెన్షనర్లు ఇలా ప్రతిఒక్కరూ ఈ వై.సి.పి పాలనపై పెదవి విరచడమే తప్ప ఎవరన్నా మద్దతుగా మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. ఇతర రాజకీయ పార్టీలని తిట్టాలన్న శ్రద్దలో పదోశాతం పాలనపై పెడితే ఇంకా మెరుగైన పాలన ఇవ్వచ్చన్న కనీస ఙ్ఞానం ఈ వై.సి.పి పార్టీకి లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎం.డి మొయినుద్దీన్, ఎండి. బషీరుద్దెన్, షాబుద్దీన్, రజాక్, షరీఫ్, రియాజ్, ఆకుల శ్రీనివాస్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.