గ్రామస్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేద్దాం

  • వి.ఆర్.పురం, కూనవరం మండలాల జనసేన ముఖ్య నాయకుల సమావేశం

రంపచోడవరం నియోజవర్గం: జనసేన పార్టీ వి.ఆర్.పురం, కూనవరం మండలాల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో రంపచోడవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతమే దిశగా చర్చించడం జరిగింది. వి.ఆర్.పురం, కూనవరం మండలాల అధ్యక్షులు ములకాల సాయికృష్ణ, దాసరి నరేంద్ర అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రంపచోడవరం నాయకులు కుర్ల రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ జనసేన పార్టీ గ్రామస్థాయిలో బలోపేతం అవుతుందని, నియోజకవర్గంలో బలమైన శక్తిగా ఎదుగుతుందని, జనసేన, టిడిపి కలిసి పని చేస్తే విజయం మనదేనని అన్నారు. ఈ సమావేశంలో మారేడుమిల్లి మండల అధ్యక్షులు మళ్ళా దుర్గాప్రసాద్, చింతూరు మండల అధ్యక్షులు మడివి రాజు,
కొనకం శ్రీనివాస్, కూనవరం సర్పంచ్ మల్లంపల్లి హేమంత్, వైస్ ఎంపీపీ బండారు సాంబశివరావు, మోహన్ రెడ్డి, అంజనరావు,విజయ రామ రాజు పవన్, సాయిబాబు, సంతోష్, పండు తదితరులు పాల్గొన్నారు.