బత్తుల విజయానికి సమిష్టిగా కృషిచేద్దాం: బొడ్డు వెంకటరమణ చౌదరి

  • బత్తుల బలరామకృష్ణకి శుభాకాంక్షలు తెలియజేసిన బొడ్డు వెంకటరమణ చౌదరి

రాజానగరం, జనసేన-తెలుగుదేశం పార్టీల పొత్తులో భాగంగా శనివారం మొదటి అభ్యర్థుల లిస్టును జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు ప్రకటించిన సందర్భంగా రాజానగరం అసెంబ్లీ స్థానాన్ని జనసేన పార్టీకి కేటాయిస్తూ బత్తుల బలరామకృష్ణ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ ప్రకటించిన సందర్భంలో జనసేన-తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ కోరుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాజానగరం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులను, కార్యకర్తలను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అనంతరం ఇరు నేతలు ఉమ్మడి ప్రణాళికతో, ఉమ్మడి మేనిఫెస్టోతో, ప్రణాళికాబద్ధంగా కార్యచరణను రూపుదిద్దుకుని రానున్న ఎన్నికల కోసం ముందుకు సాగుదామని ఇరు నేతలు మాట్లాడుకోవడం, అలానే రాజానగరం నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ విజయానికి సమిష్టిగా పనిచేయాలని ఈ సందర్భంగా బొడ్డు వెంకటరమణ చౌదరి శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన, టిడిపి సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.