చిత్తూరు రూరల్ లో భారీ యెత్తున యువత జనసేన, టీడీపీ పార్టీలో చేరిక

  • జనసేన, టీడీపీలోకి చేరిన చిత్తూరు రూరల్ యువత

చిత్తూరు నియోజకవర్గం: చిత్తూరు రూరల్ మండలం, దిగువమాసపల్లె గ్రామం నందు జనసేనలో 100 మందికి పైగా యువకులు, తెలుగుదేశంలో 100 మందికి పైగా యువకులు భారీ సంఖ్యలో జనసేన టీడీపీ నాయకత్వం పై నమ్మకంతో ఇరు పార్టీల నాయకుల సమక్షంలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమానికీ జనసేన పార్టీ తిరుపతి ఇంచార్జి కిరణ్ రాయల్, రాష్ట్ర కార్యదర్శి మరియు చిత్తూరు పి ఓ సి ఆరణి కవిత, రాష్ట్ర కార్యక్రమ నిర్వహణ కార్యదర్శి ఎ. కె శరవణ, చిత్తూరు జనసేన నాయకులు శ్రీ రామ్ లోచన్, ధీరజ్ దుద్ధి, మరియు చిత్తూరు జనసేన పార్టీ శ్రేణులు అలాగే టీడీపీ పార్టీ నుండీ టీడీపీ నాయకులు దొరబాబు, చంద్రప్రకాష్, శశిదర్ బాబు మరియు ఇతర టీడీపీ శ్రేణులు హాజరయ్యారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు జనసేన పార్టీ నుండి నవీన్, తెలుగుదేశం పార్టీ నుండి రాజు. వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తు, ఇలాగే పార్టీ బలోపేతానికి, రాబోయే ఎన్నికల్లో మన విజయానికి మరింతగా కృషిచేయాలని ఆశిస్తున్నామని తెలిపారు.