మట్టి వినాయకుడినే పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం: రాజాం జనసేన

రాజాం, వినాయక చవితి సందర్భంగా జనసేన సిద్ధాంతాల్లో ఒకటి అయినటువంటి పర్యావరణ పరిరక్షణలో భాగంగా జనసేన పార్టీ సంతకవిటి మండల నాయకులు పున్నాన శరత్ నాయుడు ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ నాయకులు యు.పి.రాజు చేతులమీదుగా మట్టి వినాయక విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకులు యు.పి.రాజు మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడే విధంగా అందరూ మట్టి వినాయకుడిని పూజిద్దాం అదేవిధంగా పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం కేవలం జనసేన పార్టీ తోనే సాధ్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గొర్లె గోవిందరావు, సామంతుల రమేష్, నమ్మి దుర్గారావు, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.