జనసేన ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల పంపిణి

ఆచంట, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 50 వ పుట్టినరోజును పురస్కరించుకొని ఆచంట నియోజకవర్గం జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఐదు రోజులు వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమహోదావరి జిల్లా సెక్రెటరీ చిట్టూరి శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా ఆచంట నియోజకవర్గంలో ఐదు రోజులు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుంతుందని, అందులో భాగంగా రెండవ రోజు మంగళవారం వల్లూరు గ్రామంలో వినాయక చవితిని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక ప్రతిమలు పంపిణి చేయడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆచంట నియోజకవర్గం జనసేన నాయుకులు, తోట ఆదినారాయణ, జనసేనపార్టీ వల్లూరు గ్రామ అధ్యక్షులు కడిమి ఉమామహేశ్వరస్వామి, మెగాఫ్యామిలీ అభిమాననాయుకులు పంపన శ్రీను, చిటకన సుబ్బారావు, జనసేన నాయుకులు రుద్ర కాసు మణి, యర్రంశెట్టి ఫణి, ఏడిద బాలు, కడిమి శ్రీనివాస్, ఏడిద తేజా విగ్నేష్ మొదలగువారు పాల్గొన్నారు.