నాయకుడిలాగే సైనికులు – ప్రాణ త్యాగాలకైనా సిద్ధమే

  • పూతలపట్టు జనసేన ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ కు పాలాభిషేకం

పూతలపట్టు నియోజకవర్గం: తవణంపల్లి మండల కేంద్రంలో వాలంటీర్ల ముసుగులో వైసిపి నాయకులు ఎక్కడయితే పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని అవమానించారో అదే చోట పూతలపట్టు జనసేన ఆధ్వర్యంలో శుక్రవారం పవన్ కళ్యాణ్ కు పాలతో అభిషేకం చేసి, ఆ దుష్టశక్తుల వలన కలిగిన మైలును కడిగి వేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ.. అధికార పార్టీ చేసే ఆగడాలకు జనసైనికులు భయపడరు అని, నాయకుడు లాగే సైనికులు ఉన్నారని, ప్రాణ త్యాగాలకైనా సిద్ధమని తెలియజేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాజశేఖర్, పూర్ణచంద్ర, మోహన్, ఉదయ్, చిన్న, అజిత్, విశ్వతేజ, పవన్, ప్రశాంత్, దేవేంద్ర మరియు మండల జనసైనికులు పాల్గొన్నారు.