వాలంటీర్ పేరుతో యువత జీవితాలు నాశనం చేస్తున్న వైసీపీ

పత్తికొండ: వైసిపి నాయకులు పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మ తగల పెట్టినందుకు వారికి వ్యతిరేకంగా శుక్రవారం పత్తికొండ టౌన్ నందు పవన్ కళ్యాణ్ ఫోటోకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకుడు సిజి రాజశేఖర్ విలేకరులతో మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దిష్టిబొమ్మ వైసిపి నాయకులు తగల పెట్టినందుకు వారికి వ్యతిరేకంగా శుక్రారం ఉదయం పత్తికొండ టౌన్ నందు అంబేద్కర్ సర్కిల్ నుంచి నాలుగు స్తంభాల దగ్గర వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం ముందుగా పవన్ కళ్యాణ్ గారి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన చోట పసుపు నీళ్లు చల్లి, పవన్ కళ్యాణ్ గారి ఫోటోకు పాలాభిషేకం చేయడం జరిగింది. 30వేల మందికి పైగా మహిళలు కనపడకుండా పోయారని కేంద్ర నిఘావర్గాల సమాచారాన్ని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు వివరిస్తే, ఆ అంశానికి వివరణ ఇవ్వలేని, సమీక్ష జరపలేని పనికిమాలిన వైసీపీ ప్రభుత్వం. నేడు వాలంటీర్ల ముసుగులో వైసీపీ కార్యకర్తల చేత ఆందోళనలు చేయిస్తుంది. వాలంటీర్లు పేరుతో యువత జీవితాలు నాశనం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది మీకోసం, మీ భవిష్యత్తు కోసమే అని మీకు తెలియజేస్తున్నాం, మీ వాలంటీర్లు పేరుతో డేటాను సేకరించినట్లు కేంద్రం నిఘావర్గాలు తెలియజేస్తున్నాయి అన్నారు. వాలంటీర్లుగా పనిచేస్తున్న మీరు అర్థం చేసుకోవాల్సింది వాలంటీర్ వ్యవస్థకి కూడా చెప్తున్నా.. మీరందరూ తప్పు చేశారు అని పవన్ కళ్యాణ్ గారు అనలేదు, కొంతమంది చెయ్యటం వల్ల మిగతావారికి కూడా చెడ్డ పేరు వస్తుంది ఇది ప్రతి ఒక్క వాలంటీర్ కి తెలియజేస్తున్నాం అక్కని కాపుడుకునే ప్రయత్నంలో అమర్నాధ్ అనే యువకుడిని కాల్చి చంపితే, అమ్మాయిలు మిస్ అయితే ఎందుకు రివ్యూ మీటింగ్ లేదు. వ్యక్తిగత వివరాలకి భంగం కలుగుతోందని వాలంటీర్ ఇన్ఫో వల్ల.. గ్రామ వాలంటీర్ స్వీకరించిన డేటా కొంత మంది వైసీపీ నాయకులు మిస్ చేస్తున్నారు..సంఘ విద్రోహ శక్తుల చేతిలో కి పోతుందని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే.. వాలంటీర్ ని తప్పగా అన్నారు అని వాలంటీర్లను వైసీపీ నాయకులు రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ గారిని ఆడ్డుకోవాలని అనుకోవడం అవివేకం. వైస్సార్సీపీ పొలిటల్ స్ట్రాటజీ ఇంతే.. వాలంటీర్లు కొందరు సరిగా పనిచేయట్లేదు.. ఇది నిజం కాదా?. పవన్ కళ్యాణ్ గారు చెపుతున్న మాటలు దయచేసి అర్థం చేసుకోండి. వైసీపీ కార్యకర్తలు కాకుండా నిజాయితీగా వాలంటీర్ గా పని చేసేవారు ఈ విషయాలు మీరు తెలుసుకోవాలి. 5 వేల రూపాయల వేతనం ఇచ్చి వెట్టి చాకిరీ చేయించుకుంటుంది ఎవరు?. 4 ఏళ్లుగా ఉద్యోగాలు కల్పించకుండా 5వేల జీతానికి ఊడిగం చేయిస్తూ బ్రతుకులు నాశనం చేసింది ఎవరు?. వాలంటీర్ అని మభ్యపెట్టి ప్రభుత్వ ఉద్యోగాల ఊసు ఎత్తకుండా మీ వయస్సు అర్హతలో 4 యేళ్లు నాశనం చేసి అర్హత లేకుండా చేసింది ఎవరు?. ప్రభుత్వ పథకాల చేరవేత అని చెప్పి, మీ చేత ప్రజల డేటా సేకరిస్తుంది ఎవరు?.
మీ చేత డేటా సేకరించి, దానిని అసాంఘిక కార్యకలాపాలకు వాడుతున్నది ఎవరు?. మీ జీవితాల్లో ఎదిగే అవకాశాలు లేకుండా చేసి 5 వేల దగ్గరే ఉంచింది ఎవరు?. వాలంటీర్ వ్యవస్థతో వాలంటీర్ల జీవితాలు మారలేదు, వారిని అడ్డుపెట్టుకుని వైసీపీ నాయకులు బాగుపడుతున్నారు అనేది వాస్తవం కాదా?..
వైసీపీ సభలు, సమావేశాలకు ప్రజల్ని తీసుకొచ్చే భాధ్యత మీపై వేశారా లేదా?.. మీ ప్రాంతంలో ప్రజలను మీ చేత భయపెట్టిస్తున్నరా లేదా? ఆలోచించండి గ్రామ వాలంటీర్లు, మీ జీవితాలలో వృద్ది లేకుండా చేస్తున్నాడు ఈ వై.ఎస్ జగన్, మీ భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు జనసేన పార్టీ కృషి చేస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.